హైదరబాద్​లోఇవాళ (జూన్ 9) కవులు, కళాకారులు, సాహితీవేత్తలతో సదస్సు..హాజరుకానున్న మంత్రి జూపల్లి

హైదరబాద్​లోఇవాళ (జూన్ 9) కవులు, కళాకారులు, సాహితీవేత్తలతో సదస్సు..హాజరుకానున్న మంత్రి జూపల్లి

హైదరాబాద్, వెలుగు: హైదరబాద్​లోని  బేగంపేట టూరిజం ప్లాజాలో సోమవారం ఉదయం 10:30 గంటలకు కవులు, కళాకారులు, సాహితీవేత్తలతో సదస్సు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిన నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్నదానిపై చర్చించనున్నారు. వారి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.

ఆటపాటలు, తమ రచనల ద్వారా విస్తృత ప్రచారం కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యక్రమానికి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సుమారు 50 మంది వరకు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు పాల్గొననున్నారు.